రైతుల సంక్షేమానికే ‘భరోసా’ కేంద్రాలు

ABN , First Publish Date - 2020-05-31T10:41:02+05:30 IST

రైతులు అధిక దిగుబడులను సాధిం చేందుకే రైతుభరోసా కేంద్రాల ను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఎమ్మెల్యే

రైతుల సంక్షేమానికే ‘భరోసా’ కేంద్రాలు

చిల్లకూరు/కోట: రైతులు  అధిక దిగుబడులను సాధిం చేందుకే రైతుభరోసా కేంద్రాల ను అందుబాటులోకి తీసుకు వచ్చామని ఎమ్మెల్యే వర ప్రసాద్‌రావు అన్నారు. శని వారం  చిల్లకూరు, కడివేడు, చిట్టేడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రారం భించారు. తహసీల్దారు రవి కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు, ఎంపీడీవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో పండ్లు, రొట్టెలు, ఆహారపొట్లాలను పంపిణీ చేశారు.


గూడూరు(రూరల్‌): మండలంలోని పారిచెర్లలో సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. నాగమోహన్‌రావు, శివ  పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T10:41:02+05:30 IST