ఐదో అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-01-28T06:40:07+05:30 IST

ప్రమాదవశాత్తూ ఓ భవనంలోని ఐదో అంతస్తు నుంచి పడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐదో అంతస్తు నుంచి పడి కార్మికుడి మృతి
హనుమంతు మృతదేహం

ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు


తిరుపతి(నేరవిభాగం), జనవరి 27: ప్రమాదవశాత్తూ ఓ భవనంలోని ఐదో అంతస్తు నుంచి పడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన హనుమంతు (30) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎక్కడ పని దొరికితే అక్కడికి కుటుంబంతో సహా వెళ్లేవాడు. ఈ క్రమంలో బతుకుదెరువుకోసం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తిరుపతికొచ్చాడు. బైరాగిపట్టెడలోని ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మాణ పనులకు వెళ్లాడు. మంగళవారం ప్రమాదవశాత్తూ ఆ భవనం ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంఆర్‌పల్లె పోలీసులు ప్రాథమికంగా విచారించి బుధవారం రాత్రి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-28T06:40:07+05:30 IST