టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం సంక్షేమం
ABN , First Publish Date - 2021-04-11T06:41:05+05:30 IST
టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో సంక్షేమం సాఽధ్యమైందని, కాంగ్రెస్ పాలనలో క్షామమే తప్ప ఏం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో క్షామమే తప్ప ఏమీ లేదు
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి
తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 10: టీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో సంక్షేమం సాఽధ్యమైందని, కాంగ్రెస్ పాలనలో క్షామమే తప్ప ఏం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికలో భాగంగా శనివారం మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగును పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా సాగునీరు కేసీఆర్ వల్లే సాఽధ్యమైందన్నారు. మండలంలోని నెల్లికల్, డీ-8,9 లిఫ్టులతోనే వేలాది ఎకరాల భూములుకు సాగునీరు అందుతుందన్నారు. ప్రచారంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జాజాల సురేందర్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, ఆంగోత్ భగవాన్నాయక్, సూర్యా భాషానాయక్, దిలీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.