రైతుల సంక్షేమానికి పెద్దపీట
ABN , First Publish Date - 2021-06-20T05:44:00+05:30 IST
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, పెద్దపీట వేసిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
వట్పల్లి/పుల్కల్, జూన్ 19 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, పెద్దపీట వేసిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం వట్పల్లిలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతువేదిక భవనంలో మండల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రజనీకాంత్, ఎంపీపీ కృష్ణవేణి, సర్పంచ్ సురేఖ, ఏడీఏ హరిత పాల్గొన్నారు. ఉమ్మడి పుల్కల్ మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో పల్లె ప్రగతి పనులపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.