అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణం
ABN , First Publish Date - 2021-03-07T05:28:17+05:30 IST
మండల కేంద్రంలోని ముత్యాలపోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
ఖానాపూర్, మార్చి 6 : మండల కేంద్రంలోని ముత్యాలపోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో బాగంగా శనివారం ఆలయ ఆవరణలో అమ్మవారికల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముత్యాలపోచమ్మ, దేశపతిరాజుల శాంతి కల్యాణ ఘట్టాన్ని ఛండి ఉపాసకులు, హైదరాబాద్కు చెందిన పాలెం మనోహరశర్మ, వేదపండితులు చక్రపాణి వాసుదేవాచార్యులు, ఆలయఅర్చకులు శరత్చంద్రల వేద మంత్రోచ్చణల మఽధ్య ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. మున్సిపల్ చైర్మన్ అంకంరాజేందర్ అనూషా దంపతుల ఇంటి నుండి అమ్మవారికి ఓడిబియ్యం, తలంబ్రాలను ఎదు ర్కోలుగా తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి అమ్మవారి ఆభరణాల ఊరేగింపును భక్తులు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. అమ్మవారి ఆభరణాల ఊరేగింపు సందర్భంగా నిర్వహించిన పోతురాజుల విన్యాసం ఆకట్టుకుంది. టీజివో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయకమిటి అఽధ్యక్షులు అంకం రాజేందర్, ఉపాఽధ్యక్షులు నాగేందర్ ఆద్వర్యంలో భక్తులకు ఆలయకమిటి బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు.