రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2022-05-28T05:11:24+05:30 IST
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
ధరూరు, మే 27 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. చింతరేవుల గ్రామంలో రైతు వేదికను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ ంందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు మేలు చేకూర్చుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, సర్పంచ్ శిల్ప, మండల అధ్యక్షుడు డీఆర్ విజయ్, ఈశ్వరయ్య, నాయకులు కృష్ణారెడ్డి, సల్వారెడ్డి, దివాకర్రెడ్డి, జాంబపల్లె భరత్ పాల్గొన్నారు.