నిజాంసాగర్‌లో 8.420 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

ABN , First Publish Date - 2020-09-30T06:25:47+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 6,667 క్యూసెక్కుల నీరు వస్తుండట ంతో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. మంగళవారం నాటికి

నిజాంసాగర్‌లో 8.420 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 6,667 క్యూసెక్కుల నీరు వస్తుండట ంతో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. మంగళవారం నాటికి నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1,405 అడుగులకు గాను 1,397కు చేరుకుంది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో 8.420 టీఎంసీలకు చేరుకుంది. నిజాం సాగర్‌లోకి ఇలాగే వరద నీరు వచ్చి చేరితే నిజాంసాగర్‌ పూర్తి నీటి సామర్థ్యానికి చేరుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సింగూరులో 523.600 మీటర్లకు గాను 522.492 మీటర్ల నీటి సామర్థ్యానికి చేరు కుని, 29.917 టీఎంసీలకు గాను 24.049 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరుకుంది. సింగూరులో మరో 5 టీఎ ంసీలు చేరితే పూర్తిస్థాయిలో నిండుకుంటుంది. సింగూరు వరద గేట్లను ఎత్తి నీటిని నిజాంసాగర్‌లోకి వదిలే అవకాశం ఉంటుందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-09-30T06:25:47+05:30 IST