మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

ABN , First Publish Date - 2020-03-27T11:04:26+05:30 IST

చోడవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలకత్తాలో మృతిచెందగా, ఆ మృతదేహాన్ని గ్రామంలోకి

మృతదేహాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

చోడవరం(నరసన్నపేట రూరల్‌), మార్చి 26: చోడవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలకత్తాలో మృతిచెందగా, ఆ మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకురానియ్యకుండా ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. చోడవరం గ్రామానికి చెందిన అంపోలు నారాయణరావు(58) కలకత్తాలో మరణించాడు. మృతదేహాన్ని ఆయన బంధువులు గురువారం గ్రామానికి తీసుకువచ్చారు. అయితే కరోనా వైరస్‌ భయంతో గ్రామస్థులు మృతదేహాన్ని గ్రామంలోనికి తీసుకురానివ్వలేదు. దీంతో నేరుగా శ్మశానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.


కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తాలోని జూట్‌ మిల్లులో పని చేస్తున్న నారాయణరావుకు సుగర్‌ తీవ్రత పెరిగి, కిడ్నీలు పాడయ్యాయి. గత కొన్నాళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. అయితే ఇతర జిల్లాల్లోగానీ, ఇతర రాష్ట్రాల్లో గానీ ఎవరైనా మరణిస్తే గ్రామంలోనికి ఎనాడూ తీసుకు రానివ్వలేదని గ్రామస్థులు తెలిపారు. అందుకే మృతదేహాన్ని శ్మశానానికి తరలించామని, దీనికితోడు కరోనా వైరస్‌ కూడా కారణమని చెప్పారు. 

Updated Date - 2020-03-27T11:04:26+05:30 IST