కదులుతున్న రైలు నుంచి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువతులు జంప్.. గమనించిన హోంగార్డు వెంటనే కిందకు దిగి..
ABN , First Publish Date - 2022-04-29T16:28:58+05:30 IST
కొందరు తెలిసి తెలిసి తప్పులు చేసి, చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. తొందరపాటులో కొందరు, ఏమరపాటులో మరికొందరు అనూహ్య నిర్ణయాలు తీసుకుని...
కొందరు తెలిసి తెలిసి తప్పులు చేసి, చివరకు ప్రమాదాల బారిన పడుతుంటారు. తొందరపాటులో కొందరు, ఏమరపాటులో మరికొందరు అనూహ్య నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడిన ఘటనలు చాలా చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా ఇలాంటిదే. కదులుతున్న రైలు నుంచి ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు యువతులు కిందకు దూకేశారు. అయితే ఈ క్రమంలో ఓ యువతిని గమనించిన హోంగార్డు వెంటనే కిందకు దిగాడు. అతను గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది..
ముంబైలోని జోగేశ్వరి రైల్వే స్టేషన్లో ఏప్రిల్ 16న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ రైలు వచ్చి ప్లాట్ఫారమ్పై ఆగింది. కాసేపటికి మళ్లీ కదిలేందుకు సిద్ధమైంది. మెల్లగా కదులుతున్న సందర్భంలో ఉన్నట్టుండి ఓ యువతి ప్లాట్ఫారమ్ మీదకు జంప్ చేసింది. ఈ క్రమంలో అదుపుతప్పి రైలు కింద పడబోయింది. బోగీలో ఉన్న హోంగార్డు అల్తాఫ్ షేక్.. యువతిని గమనించి, వెంటనే తానూ కిందకు దూకి యువతిని పక్కకు లాగేశాడు. ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలోనే మరో ఇద్దరు యువతులు కూడా ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు.
దండలు మార్చుకున్న వధూవరులు.. అనంతరం స్నేహితులంతా కలిసి వధువును ఓ గది తీసుకెళ్లగా... మరుక్షణమే ఊహించని ఘటన...
ఈ ప్రమాదంలో ముగ్గురు యువతులూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, యువతి ప్రాణాలను కాపాడిన హోంగార్డును అంతా అభింనదించారు. ఈ ఘటన మొత్తం ప్లాట్ఫారమ్పై అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ కుషెర్ ఖలీద్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. హోంగార్డును అభినందిస్తూనే.. రైలు కదులుతున్న సమయంలో ప్రయాణికులు ఇలా చేయడం ప్రమాదకరమంటూ సూచించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హోంగార్డును ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.