నిందితులను గుర్తించిన బాధితురాలు!
ABN , First Publish Date - 2022-06-26T09:52:28+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం.
మేజిస్ట్రేట్ సమక్షంలో గ్యాంగ్రేప్ నిందితుల నిర్ధారణ
బంజారాహిల్స్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో అధికారులు శనివారం టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ. నిందితులను బాధితులు గుర్తుపట్టే ప్రక్రియ) పూర్తి చేశారు. పోక్సో కేసులో టీఐపీ ప్రక్రియ నిర్వహించడం రాష్ట్రంలోనే తొలిసారని అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా జువెనైల్ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లను గుర్తించేందుకు బాధిత బాలికను తీసుకెళ్లారు. అక్కడ టీఐపీ ముగిసిన తర్వాత చంచల్గూడ జైల్లో ఉన్న మరో నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను గుర్తించేందుకు నాంపల్లి నాలుగో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమక్షంలో టీఐపీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో బాధితురాలు ఆరుగురు నిందితులను గుర్తించినట్లు తెలిసింది. అనంతరం అక్కడే ఉన్న మేజిస్ట్రేట్తో నిర్ధారించినట్లు సమాచారం. టీఐపీ కోసం జైల్లో ప్రత్యేక చాంబర్ను అధికారులు కేటాయించారు. ఆ సమయంలో అధికారులను, సిబ్బందిని బయట ఉంచారు.