అన్ని వర్గాలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-01-29T04:48:08+05:30 IST
అన్ని వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు.
ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ జనవరి 28: అన్ని వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 141 మంది లబ్ధిదారులకు రూ.1.41 కోట్ల షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ... ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాములు, పట్టణాధ్యక్షుడు సయ్యద్ మోహియోద్దీన్, మాజీ జడ్పీటీసీ మాణిక్యమ్మ, మండల మహిళా అధ్యక్షురాలు సరస్వతిరెడ్డి, మంజుల పాల్గొన్నారు. కాగా మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల విద్యాధికారులతో ఎమ్మెల్యే మాణిక్రావు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.