ముగిసిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-15T05:50:49+05:30 IST

పట్టణంలోని పలు దేవాలయాల్లో ని ర్వహించిన ముక్కో టి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి.

ముగిసిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు
శాంతిహోమం నిర్వహిస్తున్న అర్చకులు

ధర్మవరం, జనవరి 14: పట్టణంలోని పలు దేవాలయాల్లో ని ర్వహించిన ముక్కో టి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీనివాసనగర్‌ లో ని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టిజగదీశ్‌, ప్రధాన కార్యదర్శి జింకా రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో అర్చకు లు మోహన్‌స్వామి, రాజేశ్‌ ఆచార్యు లు స్వామివారికి అర్చనలు, అభిషేకా లు, కలశ ఉద్వాసన తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాంతి, దుర్గా, లక్ష్మీనారాయణ ధన్వంతరి హోమాలు సంప్రదాయ పద్ధతి లో నిర్వహించారు. అదేవిధంగా శ్రీలక్ష్మీచెన్న కేశవస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీవారి గరుడోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.



Updated Date - 2022-01-15T05:50:49+05:30 IST