స్వీయ నిర్బంధంలో కొవ్వూరు పట్టణం
ABN , First Publish Date - 2020-03-31T10:46:50+05:30 IST
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అధికార యం త్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఒక వైపు కరోనా లక్షణాలున్న
కొవ్వూరు/ఉండి, మార్చి 30 : కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అధికార యం త్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఒక వైపు కరోనా లక్షణాలున్న అనుమానితులతో పాటు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి స్వీయ నిర్బంధానికి పంపిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా బందోబస్తు నిర్వ హిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఏలూరు, కొవ్వూరు సెంటర్లు నిర్మానుష్యంగా మారాయి.
పట్టణమంతా స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు అయింది. రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ సరుకులు అందిజేస్తున్నారు. రోడ్డు కమ్ రైల్వే వంతెనపై రాకపోకలు నిలిపివేసేందుకు పోలీసులు నిత్యం కాపలా ఉంటున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇద్దరిని సోమవారం ఉండి వైద్యులు పరీక్షించి ఏలూరు తరలించారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వారిని పరిక్షీంచనున్నట్టు వైద్యులు తెలిపారు.