మహిళను హత్య చేసి బంగారం తీసుకెళ్లిన దుండగులు

ABN , First Publish Date - 2020-07-14T22:36:39+05:30 IST

మహిళను హత్య చేసి బంగారం తీసుకెళ్లిన దుండగులు

మహిళను హత్య చేసి బంగారం తీసుకెళ్లిన దుండగులు

పశ్చిమగోదావరి: కొవ్వూరు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కొవ్వూరు మండలం ధర్మవరం వద్దలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళ నుంచి 15 కాసుల బంగారం ఎత్తుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. మృతురాలు కుందుల అనంతలక్ష్మిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. మృతురాలి వంటిపై ఉన్న బంగారం కోసమే దుండగులు చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2020-07-14T22:36:39+05:30 IST