పలు వాహనాలను ధ్వంసం చేసిన దుండగులు
ABN , First Publish Date - 2021-07-31T04:46:06+05:30 IST
సిర్గాపూర్ మండలం సంగెం గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రెండు ద్విచక్ర వాహనాలను దహనం చేసి, మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు.
కల్హేర్, జూలై 30: సిర్గాపూర్ మండలం సంగెం గ్రామంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు రెండు ద్విచక్ర వాహనాలను దహనం చేసి, మరికొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. శుక్రవారం సిర్గాపూర్ ఎస్ఐ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం గ్రామానికి చెందిన రాథోడ్ మారుతి, ప్రకాశ్ తమ ఇంటి ముందు గురువారం రాత్రి ఎప్పటిలాగే రెండు బైక్లను పక్కపక్కనే పార్కింగ్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని గ్రామ శివారులోని వైకుంఠధామం వద్దకు తీసుకెళ్లి దహనం చేశారు. అంతేకాకుండా సురే్షరావ్కు చెందిన కారు అద్దాలు పగులగొట్టి, అతడి బైకును, జ్ఞాన్దేవ్కు చెందిన మరో బైకును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దగ్ధం చేసిన బైకుల్లో ఒక దానిపై గంజాయి అక్రమ రవాణా కేసు నమోదై ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. రాథోడ్ మారుతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.