అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ నేడు
ABN , First Publish Date - 2020-06-05T09:42:09+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామికి పైపూతగా మూడో విడత చందనాన్ని శుక్రవారం వేకువజామున సమర్పించనున్నారు.
సింహాచలం, జూన్ 4: సింహాద్రి అప్పన్న స్వామికి పైపూతగా మూడో విడత చందనాన్ని శుక్రవారం వేకువజామున సమర్పించనున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల చందనపు ముద్దలో గురువారం సాయంత్రం ఆలయ పర్యవేక్షణాధికారి దాసరి బంగారినాయుడు పర్యవేక్షణలో ఉప ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఇతర అర్చకులు కస్తూరి, వావిలాలు, గవిలాలు, వట్టివేళ్లు, పసుపు, కుంకుమపువ్వు తదితర సుగంధ ద్రవ్యాలను మిళితం చేశారు.