గోయల్తో ముగిసిన తెలంగాణ బృందం భేటీ
ABN , First Publish Date - 2021-11-24T02:30:44+05:30 IST
తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాటే
ఢిల్లీ: తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాటే పాడింది. పార్ బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ధాన్యం సేకరణ విషయంలో ఎటూ తెలకుండానే కేంద్రమంత్రి గోయల్తో తెలంగాణ బృందం భేటీ ముగిసింది. ఈనెల 26న తెలంగాణ బృందంతో మరోసారి భేటీ జరిగే అవకాశం ఉంది. అదే రోజే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని తెలంగాణ కోరింది. ఏ సీజన్లో ఎంత ధాన్యం ఉంటుందో చెప్పాలని కేంద్రం అడిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్తోనూ తెలంగాణ బృందం భేటీ అయింది. తోమర్ దగ్గరకు బృందాన్ని పీయూష్ గోయల్ స్వయంగా తీసుకువెళ్లారు. ఎప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో స్పష్టంగా చెప్పాలని కేంద్రమంత్రులు అడిగారు. ఒక నిర్దిష్ట అంచనాతో వస్తే నిర్ణయానికి రావొచ్చని గోయల్ అన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోసారి భేటీకి పీయూష్ గోయల్ సుముఖం వ్యక్తం చేశారు.