పన్నుల పాలనకు స్వస్తి పలకాలి
ABN , First Publish Date - 2021-06-17T06:04:38+05:30 IST
వైసీపీ ప్రభుత్వం పన్నుల పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ
అనకాపల్లి, జూన్ 16: వైసీపీ ప్రభుత్వం పన్నుల పాలనకు స్వస్తి పలకాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జోనల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఓ చేత్తో ఇచ్చి, మరో చేత్తో లాగేసుకుంటోందని, పేద ప్రజలు పన్నుల భారం మోయలేని పరిస్థితిలో ఉన్నారని సత్యనారాయణ పేర్కొన్నారు. తక్షణమే పెంచిన పన్నుల జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కొణతాల అప్పలరాజు, కోలపర్తి శ్రీను, గొంతిన భక్త సాయిరామ్, ఎన్.వేణుగోపాల్, కొండబాబు పాల్గొన్నారు.