ప్రపంచంలోనే ఎత్తైన వంతెన!
ABN , First Publish Date - 2021-04-09T05:30:00+05:30 IST
కశ్మీర్ లోయలో చినాబ్ నదిపై భారతీయ రైల్వే నిర్మించిన వంతెన ఇది. ఈ వంతెన నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జమ్ము-ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్లో భాగంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు
కశ్మీర్ లోయలో చినాబ్ నదిపై భారతీయ రైల్వే నిర్మించిన వంతెన ఇది. ఈ వంతెన నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
- జమ్ము-ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్లో భాగంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు.
- ఈ వంతెన నిర్మాణం భారతీయ చరిత్రలోనే ఒక గొప్ప ఇంజనీరింగ్ ఛాలెంజ్గా చెబుతున్నారు. భారతీయ రైల్వే నిర్మించిన మొదటి కేబుల్ వంతెన ఇది. దీని పొడవు 1315 మీటర్లు.
- ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా ఇది గుర్తింపు పొందింది.
- ఈఫిల్ టవర్ కన్నా ఈ వంతెన 35 మీటర్లు ఎత్తు ఎక్కువ ఉంటుంది. దీని నిర్మాణానికి చేస్తున్న ఖర్చు 28వేల కోట్లు.
- ఆర్చ్ ఆకారంలో నిర్మించిన ఈ వంతెన బరువు కొన్ని లక్షల టన్నులు ఉంటుంది. వంతెన నిర్మాణానికి ఒక్కోరోజు 3200 మంది కార్మికులు పనిచేశారు.
- టెర్రరిస్టుల దాడులకు అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో వంతెన నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ డిజైన్తో నిర్మించారు.
- భూకంప తీవ్రత 8 నమోదైనా ఈ వంతెన చెక్కుచెదరదు. గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకోగలదు. 120 ఏళ్ల పాటు మన్నేలా వంతెన నిర్మాణం చేపట్టారు.