టీటీడీ సభ్యుడిగా మరొకరి ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2021-09-29T06:24:08+05:30 IST
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా రాజే్షశర్మ మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు.
తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా రాజే్షశర్మ మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారు వాకిలి వద్ద రాజే్షశర్మతో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, శ్రీవారితీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీటేబుల్ బుక్ను ధర్మారెడ్డి అందజేశారు.