మద్యం దొరక్క వృద్ధుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-04T09:59:05+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దొరక్క పోవడంతో ఓ వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు

మద్యం దొరక్క వృద్ధుడి ఆత్మహత్య

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 3: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దొరక్క పోవడంతో ఓ వృద్ధుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణంలోని బారాహిమామ్‌ కాలనీకి చెందిన జీకురు నర్సయ్య(60) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  ఆదివారం ఉదయం రేషన్‌ బియ్యం తెస్తానని చెప్పి ఇంట్లో నుండి సంచి తీసుకొని వెళ్లి తిరిగి రాలేదు. సిద్దిపేట శివారులోని ఎల్లమ్మ గుడి సమీపంలోని బావిలో నర్సయ్య మృతదేహం కనపడింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు   సీఐ పరశురామ్‌ తెలిపారు.

Updated Date - 2020-04-04T09:59:05+05:30 IST