పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-03T10:51:40+05:30 IST

మండలంలోని పెద్ద లంబాడితండాకు చెందిన ధరావత్‌ దేవేందర్‌ (22)అనే యువకుడు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి

పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం

నెన్నెల, జులై 2: మండలంలోని పెద్ద లంబాడితండాకు చెందిన ధరావత్‌ దేవేందర్‌ (22)అనే యువకుడు గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. గుడుంబా తరలిస్తూ పట్టుబడ్డ తమ కొడుకును నెన్నెల పోలీసులు చితకబాదడంతోపాటు మరోసారి పోలీసుస్టేషన్‌కు పిలిపించడంతో భయపడి ఇంట్లో పురుగుల మందు తాగాడని అతడి తల్లిదండ్రులు అమృత, తిరుమల్‌నాయక్‌ ఆరోపించారు. గుడుంబా ఎక్కడ విక్రయిస్తున్నావని, నాటుసారా విక్రయించే వారి వివరాలు చెప్పాలని బుధవారం స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారని, గురువారం మరోసారి పోలీస్‌స్టేషన్‌కు రమ్మనడంతో కొడతారనే భయంతోనే  పురుగుల మందు తాగాడని వారు చెప్పారు. అంబులెన్స్‌లో మంచిర్యాలకు తరలించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని వివరించారు.  ఈ విషయంపై ఎస్సై రమాకాంత్‌ను వివరణ కోరగా గుడుంబా తరలిస్తూ పట్టుబడడంతో  యువకుడిపై కేసు నమోదు చేశామని, అతడిని కొట్టలేదని, కౌన్సెలింగ్‌ కోసం తండ్రిని వెంటబెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు రమ్మన్నామని ఎస్సై పేర్కొన్నారు.

Updated Date - 2020-07-03T10:51:40+05:30 IST