నాగావళిలో సాన్నానికి వెళ్లి విద్యార్థి మృతి
ABN , First Publish Date - 2022-01-27T05:42:20+05:30 IST
నాగావళిలో సాన్నానికి వెళ్లి విద్యార్థి మృతి
గుజరాతీపేట : శ్రీకాకుళంనగరం పరిధి నాగావళినదిలో ప్రమాదవశాత్తుపడి బుధవారం ఓ విద్యార్థి మృతిచెందాడు. ఒకటో పట్టణ ఎస్ఐ దుర్గాప్రసాద్ కథనం మేరకు.... ఓ ప్రైవేటు కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న అనపర్తి రాజు(22) ఓ లెక్చరర్ తల్లి మరణించడంతో పరామర్శకు శ్రీకాకుళం వచ్చాడు. సమీపంలో గల నాగావళినదిలో స్నానానికివెళ్లి లోతుగాఉన్న ప్రాంతంలో రాజు పడిపోయాడు. పోలీ సులకు సమాచారం అందడంతో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత రాజు మృతదేహం లభ్యమయింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసునమోదు చేశారు.