విద్యార్థిలోకం కదలాలి
ABN , First Publish Date - 2021-12-18T08:13:25+05:30 IST
విద్యార్థిలోకం కదలాలి
రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించే రాజకీయ పార్టీలు వేదికపై ఉన్నాయి. ‘నేను ఉన్నాను...నేను విన్నాను...’అని చెప్పిన వ్యక్తి, విద్యార్థులే లేరు. మన భవిష్యత్ను తొక్కేస్తుంటే విద్యార్థులు మాట్లాడకుండా ఉంటే ఎలా? సినిమా టికెట్లు బుక్ చేసుకునేంత ఓపిక.. రాష్ట్రం కోసం కనిపించడంలేదు. ఎన్నికలకు ముందే చెప్పా. జగన్ సీఎం అయితే అమరావతికి బొంద పెడతాడన్న నా మాటలే ఈనాడు నిజమయ్యాయి. వైసీపీ నుంచి యర్రమనేని శ్రీధర్ ఒక్కరే రైతుల కోసం నిలబడ్డారు. అమరావతిని ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను పల్నాటి బిడ్డను. ప్రాణాలకు నేను భయపడను.
- శివాజీ, సినీనటుడు