ఎస్టీఐ మొండి వైఖరి నశించాలి
ABN , First Publish Date - 2022-05-20T04:57:18+05:30 IST
డిపోలో ఎస్టీఐ మొండి వైఖరిని నిర సిస్తూ గేటు ధర్నా నిర్వహించారు. డిపో కార్యదర్శి ఎస్వైబాషా మా ట్లాడుతూ ఎస్టీఐ వచ్చినప్పటి నుంచీ ఇష్టానుసారంగా వ్యవహరి స్తూ డిపోలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రాయచోటి(కలెక్టరేట్), మే19: డిపోలో ఎస్టీఐ మొండి వైఖరిని నిర సిస్తూ గేటు ధర్నా నిర్వహించారు. డిపో కార్యదర్శి ఎస్వైబాషా మా ట్లాడుతూ ఎస్టీఐ వచ్చినప్పటి నుంచీ ఇష్టానుసారంగా వ్యవహరి స్తూ డిపోలో సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. లీవ్ల విష యంలో వేధించడం, గ్యారేజ్లో ఎంఎఫ్ బస్సుల పనితీరు సరిగ్గా చేయకపోవడం, గ్యారేజ్ కార్మికులను వేధించడం మానుకోవాలని కోరారు. డిపో ప్రెసిడెంట్ ఆర్వీ గోపాల్ మాట్లాడుతూ బస్సుల కండీషన్ గురించి ఎన్ఎంయూఏఏడీసీలనే టార్గెట్ చేస్తూ వ్యవహ రించడంపై మాట్లాడారు. కార్యక్రమంలో గ్యారేజ్ కార్యదర్శి బీహెచ్ బాబు, సీనియర్ నేతలు నాగరాజు, సీసీఎస్ డెలిగేట్ బాల, అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.