ప్రజాస్వామ్యానికి, కుటుంబ పాలనకు మధ్య పోరు

ABN , First Publish Date - 2020-11-28T07:57:23+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు... ప్రజాస్వామ్యానికి, కుటుంబ పాలనకు మధ్య జరుగుతున్న పోరాటమని బీజేపీ జాతీయ ప్రధాన

ప్రజాస్వామ్యానికి, కుటుంబ పాలనకు మధ్య పోరు

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీదే విజయం: భూపేంద్ర యాదవ్‌

బీజేపీలో చేరిన ముఖేశ్‌ గౌడ్‌ తనయుడు విక్రమ్‌గౌడ్‌

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు... ప్రజాస్వామ్యానికి, కుటుంబ పాలనకు మధ్య జరుగుతున్న పోరాటమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యమని స్పష్టం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు విక్రమ్‌గౌడ్‌ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిందని పేర్కొన్నారు. తమకు న్యాయం జరగడానికి బీజేపీయే సరైన వేదికని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.


Updated Date - 2020-11-28T07:57:23+05:30 IST