కేంద్రాన్ని గుడ్డిగా సమర్థిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-10-28T06:20:35+05:30 IST
: కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా సమర్థిస్తోందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంటేష్ అన్నారు. భువన గిరిలో బుధవారం నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
భువనగిరిటౌన్, అక్టోబరు 27: కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా సమర్థిస్తోందని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంటేష్ అన్నారు. భువన గిరిలో బుధవారం నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చమురు ధరల పెంపు, ప్రశ్నించే వారిని అణచివేత తదితర కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తోందన్నారు. ప్రజా వ్యతి రేక నిర్ణయాలపై ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గ నవీన్, గడ్డం వెంకటేష్, వైస్ ఎంపీపీ నాగటి ఉపేం దర్, ఉప్పలపల్లి బాలకృష్ణ, మెట్టు శ్రవణ్, హరిష్, శివ తదితరులు పాల్గొన్నారు.