స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో నిబద్ధతతో ఓటు వేయాలి

ABN , First Publish Date - 2021-07-25T05:50:43+05:30 IST

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో కార్పొరేటర్లు నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని జీవీఎంసీ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన కోరారు.

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో నిబద్ధతతో ఓటు వేయాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కమిషనర్‌ సృజన, వేదికపై మేయర్‌ జీహెచ్‌వీ కుమారి

విశాఖపట్నం, జూలై 24(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో కార్పొరేటర్లు నిబద్ధతతో ఓటు హక్కు వినియోగించుకోవాలని జీవీఎంసీ మేయర్‌ జీహెచ్‌వీ కుమారి, కమిషనర్‌ డాక్టర్‌  జి.సృజన కోరారు. స్టాండింగ్‌ కమిటీకి ఈ నెల 27న ఎన్నిక జరగనున్నందున ఓటు హక్కు వినియోగంపై కార్పొరేటర్లకు పాత కౌన్సిల్‌ హాల్‌లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌, కమిషనర్‌లు మాట్లాడుతూ స్టాండింగ్‌ కమిటీ ఆవశ్యకత, పనితీరు గురించి వివరించారు. ఓటుహక్కు వినియోగం, తిరస్కరణ అంశాలపై  పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జీవీఎంసీ సలహాదారు జీవీవీఎస్‌ మూర్తి వివరించారు. అనంతరం కార్పొరేటర్ల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఏవీ రమణి, కార్యదర్శి లావణ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T05:50:43+05:30 IST