యువాన్ వాంగ్-5 యాత్రను వాయిదా వేయండి
ABN , First Publish Date - 2022-08-07T07:15:16+05:30 IST
క్షిణ భారతంతోపాటు.. ఒడిసాలోని చాందీపూర్లో ఉన్న క్షిపణి పరీక్ష కేంద్రం, ఇతర రక్షణ కేంద్రాల పాలిట ముప్పుగా పరిణమించనున్న
చైనాను కోరిన శ్రీలంక సర్కారు
కొలంబో, ఆగస్టు 6: దక్షిణ భారతంతోపాటు.. ఒడిసాలోని చాందీపూర్లో ఉన్న క్షిపణి పరీక్ష కేంద్రం, ఇతర రక్షణ కేంద్రాల పాలిట ముప్పుగా పరిణమించనున్న చైనా అధునాతన నిఘా నౌక యువాన్ వాం గ్-5.. శ్రీలంక యాత్ర వాయిదా పడనుంది. ఈ మేరకు శ్రీలంక సర్కారు చైనాకు విజ్ఞప్తి చేసింది. ఈ నెల 11న ఆ నౌక శ్రీలంకలోని హంబనటొట నౌకాశ్రయానికి రావాల్సి ఉంది. దీనిపై తొలి నుంచి భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. యువాన్వాంగ్ యాత్ర వద్దంటూ లంక కోరడాన్ని భారత్ స్వాగతించింది.