తండ్రిని హత్యచేసిన కొడుకు

ABN , First Publish Date - 2021-07-27T05:55:16+05:30 IST

జిల్లా కేంద్రంలోని కైలాస్‌న గర్‌లో తాగిన మైకంలో తండ్రినే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. రూరల్‌ సీఐ పురుషోత్తంచారి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.బొందయ్య(60), కుమారుడు సురేష్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కొడుకు సురేష్‌ తండ్రి బొందయ్య తలపై అక్కడే ఉన్న బండతో గట్టిగా కొట్టాడు. దీంతో బొందయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

తండ్రిని హత్యచేసిన కొడుకు
రక్తపు మడుగులో మృతి చెందిన బొందయ్య

మద్యం మత్తులో ఘటన

పరారీలో నిందితుడు

ఆదిలాబాద్‌టౌన్‌, జూలై 26: జిల్లా కేంద్రంలోని కైలాస్‌న గర్‌లో తాగిన మైకంలో తండ్రినే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. రూరల్‌ సీఐ పురుషోత్తంచారి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కైలాస్‌నగర్‌ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.బొందయ్య(60), కుమారుడు సురేష్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో రగిలిపోయిన కొడుకు సురేష్‌ తండ్రి బొందయ్య తలపై అక్కడే ఉన్న బండతో గట్టిగా కొట్టాడు. దీంతో బొందయ్య అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. నిందితు డు సురేష్‌ పరారీలో ఉన్నాడని కేసు నమోదు చేసుకుని గాలింపు చేపడతామని సీఐ పురుషోత్తంచారి తెలిపారు.

Updated Date - 2021-07-27T05:55:16+05:30 IST