తండ్రి మందలించాడని కుమారుడు అదృశ్యం
ABN , First Publish Date - 2022-01-27T06:32:22+05:30 IST
తండ్రి మందలించడానికి హుజూర్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ వెంకటరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ చెందిన షేక్ జానిమియా అనే 18 ఏళ్ల యువకుడు తండ్రి నడు పుతున్న టిఫెన్ సెంటరులో పనిచేస్తున్నాడు.
హుజూర్నగర్, జనవరి 26: తండ్రి మందలించడానికి హుజూర్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ వెంకటరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ చెందిన షేక్ జానిమియా అనే 18 ఏళ్ల యువకుడు తండ్రి నడు పుతున్న టిఫెన్ సెంటరులో పనిచేస్తున్నాడు. ఇటీవల మద్యం తాగు తున్నందున తండ్రి మందలించాడు. దీంతో ఈనెల 25వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. కుమారుడి కోసం చుట్టుపక్కల గాలించినా, బంధువులను వాకబు చేసినా అతడి ఆచూకి తెలియరాలేదు. తండ్రి అబ్దుల్లా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.