నేను కొత్త అమ్మతో ఎందుకు ఉండాలి? ఆమె నాకు నచ్చలేదు.. చిల్డ్రన్స్ కమిషన్కు ఓ బాలుడి లేఖ!
ABN , First Publish Date - 2021-12-18T20:56:43+05:30 IST
ఆ భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కొడుకులను ఇద్దరూ పంచుకున్నారు.
ఆ భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కొడుకులను చెరొకరు పంచుకున్నారు. ఒక కొడుకును తనతో పాటు తీసుకెళ్లిన తండ్రి కొన్ని రోజులకు మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ బాలుడు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాడు. తన బాధలను వివరిస్తూ చిల్డ్రన్స్ కమిషన్కు ఓ లేఖ రాశాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది.
`మా అమ్మ, నాన్న విడాకులు తీసుకున్నారు. నన్ను మా నాన్నతో పంపించారు. ఇప్పుడు మా ఇంటికి మరో మహిళ వచ్చింది. ఆమెను `అమ్మా` అని పిలవమంటున్నారు. మా అమ్మ బతికే ఉండగా.. నేను వేరే మహిళను ఎందుకు `అమ్మా` అని పిలవాలి. ఆ కొత్త అమ్మతో నేనెందుకు ఉండాలి? విడిపోయేటపుడు నేను ఏమనుకుంటున్నానని నన్ను ఎవరూ అడగలేదు. నేను మా అమ్మతోనే ఉండాలనుకుంటున్నా. నాకు న్యాయం చేయండ`ని ఆ బాలుడు పేర్కొన్నాడు. ఈ కేసులో తల్లిదండ్రులిద్దరినీ కౌన్సిలింగ్కు పిలిచినట్టు చిల్డ్రన్స్ కమిషన్ మెంబర్ బ్రజేష్ చౌహాన్ తెలిపారు.