వైద్యుల సేవలు సమాజానికి అవసరం

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

వైద్యుల సేవలు సమాజానికి అవసరం

వైద్యుల సేవలు సమాజానికి అవసరం
శంషాబాద్‌: వైద్యులను సన్మానిస్తున్న చైర్‌పర్సన్‌

శంషాబాద్‌/శంకర్‌పల్లి/ఆమనగల్లు/ఇబ్రహీంపట్నం, జూలై 1: వైద్యుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శంషాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్యులను శుక్రవారం నాడు ఆమె సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు దివ్య, రామకృష్ణారెడ్డి, ఉషారెడ్డి, శంకర్‌, సిరిస్వచ్ఛంద సంస్థకు చెందిన రమాదేవి, చంద్రకళ పాల్గొన్నారు. అదేవిధంగా శంకర్‌పల్లిలోని పీహెచ్‌సీలో డాక్టర్‌ రేవతిరెడ్డిని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్శిరాధా బాలకృష్ణ, శ్వేతాపాండురంగారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం జాతీయ డాక్టర్స్‌డే వేడుకలు లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లయన్స్‌క్లబ్‌ ఆమనగల్లు అధ్యక్షుడు భైరి కరుణాకర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ కార్యదర్శి కుడుముల భాస్కర్‌ రెడ్డి, జోన్‌ చైర్మన్‌ కె. రాంరెడ్డి, చంద్రశేఖర్‌ వైద్యురాలు జయశ్రీ, సిబ్బందిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. పాష, కొండల్‌ రెడ్డి, శివకుమార్‌ ఉన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం లిమ్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్స్‌ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు రామరాజు, వివ్వనాథ్‌లను సత్కరించారు. కార్యక్రమంలో లిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు దినేష్‌, నరేష్‌, ఆనంద్‌, తేజ, అభిలాష్‌, మేనేజ్‌ బాష ఉన్నారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST