బ్రిడ్జి మీద కూర్చుని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న యువకుడు.. అప్పుడే ఓ భారీ ట్రక్ బ్రిడ్జి ఎక్కడంతో ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-04-10T21:42:35+05:30 IST
అతను ఓ ఉపాధ్యాయుడు.. ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ బైజూస్ ద్వారా విద్యా బోధన చేస్తుంటాడు..
అతను ఓ ఉపాధ్యాయుడు.. ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ఫామ్ బైజూస్ ద్వారా విద్యా బోధన చేస్తుంటాడు.. గత గురువారం తన స్నేహితులతో కలిసి ఓ బ్రిడ్జి మీదకు వెళ్లాడు.. బ్రిడ్జి రెయిలింగ్ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు.. ఆ సమయంలో ఓ భారీ ట్రక్కు బ్రిడ్జి మీద ప్రయాణిస్తోంది.. అ అదురుకు బ్రిడ్జి కాస్త ఊగింది.. దాంతో రెయిలింగ్ మీద కూర్చున్న ఆ వ్యక్తి 60 అడుగుల లోతు ఉన్న నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన మోహిత్ ప్రజాపతి అనే యువకుడు గత గురువారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి భద్బదా బ్రిడ్జి మీదకు వెళ్లాడు. స్నేహితులతో మాట్లాడుతూ బ్రిడ్జి రెయిలింగ్ మీద కూర్చున్నాడు. ఆ సమయంలో ఓ భారీ ట్రక్కు బ్రిడ్జి మీద నుంచి వేగంగా ప్రయాణించింది. ఆ వైబ్రేషన్కు మోహిత్ తన బ్యాలెన్స్ కోల్పోయి కింద ఉన్న నదిలో పడిపోయాడు. 60 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉండడంతో ఎవరూ మోహిత్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు.
మోహిత్ స్నేహితులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. డైవర్స్తో పోలీసులు వెతికించారు. అయినా మోహిత్ ఆచూకీ లభించలేదు. దాదాపు రెండు రోజుల అన్వేషణ తర్వాత శనివారం సాయంత్రం మోహిత్ మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.