మహాత్మా జ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివి..

ABN , First Publish Date - 2022-05-27T05:37:47+05:30 IST

పేదప్రజల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివి..
జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి

జూలపల్లి, మే 26 : పేదప్రజల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని బాల్‌రాజ్‌పల్లిలో ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబాఫూలే నూతన విగ్రహాన్ని గురు వారం స్థానిక ప్రజాప్రతిధులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలను కొనసా గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొద్దు ల లక్ష్మీనర్సయ్య, ఎంపీపీ రమాదేవి, మార్కెట్‌ చైర్మన్‌ కంది చొక్కారెడ్డి, విండో చైర్మ న్‌ పుల్లూరి వేణుగోపాల్‌రావు, సర్పంచులు కుంటూరి రాజయ్య, దారబోయిన న ర్సింహాయాదవ్‌, మేచినేని సంతోష్‌రావు, ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ మల్లేశం, విండో వైస్‌చైర్మన్‌ ముత్తలింగం, ఉపసర్పంచ్‌ అడువాల తిరుపతి, నాయకులు కొత్త రవిం దర్‌, కుంటూరి స్వామి, కోరికంటి మల్లేశం, నలిగేటి సది తదితరులు పాల్గన్నారు.

Updated Date - 2022-05-27T05:37:47+05:30 IST