అగ్నిమాపక ఉద్యోగుల సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-04-15T05:50:25+05:30 IST

అగ్నిమాపక ఉద్యోగుల సేవలు మరువలేనివని జిల్లా అగ్ని మాపక అధికారి సీహెచ్‌ కృపావరం పేర్కొన్నారు. స్థానిక అగ్నిమాపక కార్యా లయంలో బుధవారం వారోత్సవాలు నిర్వహించారు.

అగ్నిమాపక ఉద్యోగుల సేవలు మరువలేనివి
శ్రీకాకుళం: అమరులైన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పిస్తున్న దృశ్యం

జిల్లా అధికారి కృపావరం

గుజరాతీపేట: అగ్నిమాపక ఉద్యోగుల సేవలు మరువలేనివని జిల్లా అగ్ని మాపక అధికారి సీహెచ్‌ కృపావరం పేర్కొన్నారు. స్థానిక అగ్నిమాపక కార్యా లయంలో బుధవారం వారోత్సవాలు నిర్వహించారు. అమరులైన అగ్నిమాపక ఉద్యోగుల త్యాగాలను స్మరిం చుకున్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌వో కె.శ్రీనుబాబు, సిబ్బంది పాల్గొన్నారు. రణస్థలం: అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి పి.అశోక్‌  తెలిపారు. అగ్నిమాపక  వారోత్సవాల్లో భాగంగా బుధవారం అమరులైన అగ్నిమాపక ఉద్యోగుల ఆత్మ శాంతించాలని మౌనం పాటించారు. ఆమదాలవలస: అమరవీరుల సేవలు మరువలేనివని అగ్రిమాపక  అధికారి బి.హరినారాయణ తెలిపారు. బుధవారం ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రం వద్ద వారోత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించి  అగ్ని ప్రమా దాల్లో అమరవీరులైనవారికి నివాళులర్పించారు. సోంపేట: సోంపేట అగ్నిమాపక కేంద్రంలో బుధవారం అగ్నిమాపక వారోత్సవాలను కార్యాలయ అధికారి వరహాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  బొంబాయి వాడరేవులో 1944 ఏప్రిల్‌ 14న జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన అగ్నిమాపక సిబ్బంది జ్ఞాపకాలకు గుర్తుగా ఏటా ప్రజలను చైతన్య పరిచేందుకు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆనాటి దుర్ఘటనలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. 


 

Updated Date - 2021-04-15T05:50:25+05:30 IST