‘మా’లో ఏం జరిగిందో అమ్మకే తెలియాలి..

ABN , First Publish Date - 2021-10-15T07:54:41+05:30 IST

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ఏం జరిగిందో కనకదుర్గమ్మకే తెలియాలి అని సినీనటి హేమ అన్నారు.

‘మా’లో ఏం జరిగిందో అమ్మకే తెలియాలి..

  • సినీ నటి హేమ

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో ఏం జరిగిందో కనకదుర్గమ్మకే తెలియాలి అని సినీనటి హేమ అన్నారు. రాత్రి గెలిచిన తాను ఉదయానికి ఓడిపోయానని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఆమె గురువారం దర్శించుకున్నారు. వేద ఆశీర్వచనం అనంతరం హేమ మీడియాతో మాట్లాడారు. ఏటా అమ్మవారిని దర్శించుకుని, కొండంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు. అమ్మవారికి ఏటా చీరను కానుకగా ఇస్తానని, ఈ ఏడాది తనకు చీర ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్‌ అనుకోకుండా తనకు చీరను బహుకరించారని, ఇది తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని హేమ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-15T07:54:41+05:30 IST