తెలంగాణ ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-11-07T20:12:38+05:30 IST

తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అనుమతి లభించిన తర్వాత వెంటనే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి.

తెలంగాణ ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ చార్జీల పెంపుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అనుమతి లభించిన తర్వాత వెంటనే కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. ఆర్టీసీ చార్జీల పెంపుపై సమావేశం ముగిసింది. సమావేశానంతరం ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మీడియాతో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదని స్పష్టం చేశారు. చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌కు మరోసారి ప్రతిపాదనలు పంపిస్తున్నామని ప్రకటించారు. ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. డీజిల్ ధరలు భారీగా పెంచడం వల్లే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు కిలోమీటర్‌కు 30 పైసలు, సిటీ, ఆర్డినరీ బస్సులకు కిలోమీటరకు 25 పైసలు, మెట్రో డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆమోదం తర్వాత అధికారికంగా ఆర్టీసీ ప్రకటించనుంది.

Updated Date - 2021-11-07T20:12:38+05:30 IST