సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

వైసీపీ మానసపుత్రికగా చెప్పుకున్న సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సచివా లయాలకు శాశ్వత భవ నాల నిర్మాణం కలగామారింది. పలుచోట్ల చేపట్టిన ని ర్మాణాలు నిధులు విడుదల కాక మధ్య లోనే నిలిచిపోయాయి.

సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తం
నిలిచిన సచివాలయ నిర్మాణం పనులు

నిర్మాణాలు పూర్తికాని భవనాలు

కాంట్రాక్టర్లకు అందని బిల్లులు

అద్దె గదుల్లో అరకొరగా సేవలు

పెద్ద దోర్నాల, మే 15 :  వైసీపీ మానసపుత్రికగా చెప్పుకున్న సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సచివా లయాలకు శాశ్వత భవ నాల నిర్మాణం కలగామారింది. పలుచోట్ల చేపట్టిన ని ర్మాణాలు నిధులు విడుదల కాక మధ్య లోనే నిలిచిపోయాయి.  మండలంలోని 11 సచివాలయాలకు నిధులు మం జూరు చేస్తూ పనులకు అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో అన్ని సచివాలయాలకు ఆర్భాటంగా పనులు ప్రారంభించారు. చా లా వరకు 70 నుంచి 90 శాతం పనులు జరిగాయి. కానీ ప్రభుత్వం ఇంత వరకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేశారు. దీంతో అద్దె భవనాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దోర్నాల పంచాయతీ కార్యాలయంలో సచివాలయం 2, చింతల సచివాలయం సిబ్బంది విధులు నిర్వహించేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. ఒకరి తర్వాత మరొకరు విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సిబ్బంది కోరుతున్నారు. బిల్లులు చెల్లి స్తేనే పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు.  

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST