అప్పన్నకు రెండో విడత చందన సమర్పణ
ABN , First Publish Date - 2022-05-17T06:17:04+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామికి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా సోమవారం రెండో విడత చందన సమర్పణ చేశారు.
సింహాచలం, మే 16: వరాహలక్ష్మీనృసింహస్వామికి వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా సోమవారం రెండో విడత చందన సమర్పణ చేశారు. ఏటా సింహాద్రినాథునికి వైశాఖ పౌర్ణమి నాడు రెండో విడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించడం ఆచారంగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పూజాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి భాండాగారంలో సిద్ధంగా వుంచిన మూడు మణుగుల (125 కిలోల) చందనాన్ని అంతరాలయంలోని స్వామివారికి సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశాక శిరస్సున, శంఖుచక్రాలకు చందనపు ముద్దలతో అలంకరించారు.