పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-05-19T06:34:20+05:30 IST

ఉపాధ్యాయుల సా ధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

కలెక్టరేట్‌ ఎదుట యూఎ్‌సపీసీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ ధర్నా 


భువనగిరి రూరల్‌, మే18: ఉపాధ్యాయుల సా ధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యుల్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌చేస్తూ యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సం ఘం ప్రతినిధులు మాట్లాడుతూ జీవో నెంబర్‌ 317 అమలుతో సీనియారిటీ, స్పెషల్‌ కేటగిరీ, భార్య, భర్తల సమస్యలపై పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించా లన్నారు. ప్రతీ నెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు తునికి విజయ్‌, ముక్కెర్ల యాదయ్య, లక్ష్మీనర్సింహారెడ్డి, పరిపూర్ణచారి, మల్లేశ్‌, సత్యనారాయణ, వనిత, అంజయ్య తదితరులున్నారు.  

Updated Date - 2022-05-19T06:34:20+05:30 IST