ఇసుక లారీ బోల్తా..తప్పిన పెనుప్రమాదం
ABN , First Publish Date - 2021-05-09T05:27:50+05:30 IST
పాలకొండ-విశాఖ ప్రధాన మార్గంలో సంకిలి కంఠ చెరువు వద్ద శనివారం ఇసుక లారీ బోల్తాపడింది.
రేగిడి, మే 8: పాలకొండ-విశాఖ ప్రధాన మార్గంలో సంకిలి కంఠ చెరువు వద్ద శనివారం ఇసుక లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. బత్తిలి నుంచి ఇసుక లోడుతో విశాఖవైపు వెళ్తున్న లారీ సంకిలి వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. నిత్యం పాదచారులు, వాహన చోదకులతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రస్తుతం కర్ఫ్యూ కారణంగా ఆ సమయంలో ప్రజలెవరూ తిరగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. అటుగా వెళ్తున్న పాలకొండ డీఎస్పీ శ్రావణి, ఎస్ఐ షేక్ అహమ్మద్ ఆలీలు పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.