2022 మార్చి నాటికి సాలూరు బైపాస్ రోడ్డు పూర్తి
ABN , First Publish Date - 2021-08-09T23:45:55+05:30 IST
సాలూరు బైపాస్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి
న్యూఢిల్లీ: సాలూరు బైపాస్ రోడ్డు పనులను పూర్తి చేస్తామని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాయపూర్-విశాఖపట్నం సెక్షన్ జాతీయ రహదారి 26లో భాగంగా సాలూరు టౌన్ వద్ద బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారు. 2022 మార్చి నాటికి సాలూరు బైపాస్ రోడ్డు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సాలూరు బైపాస్ రోడ్డు పనుల పురోగతిపై రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గడ్కరీ జవాబిచ్చారు. ఈ సందర్భంగా గడ్కరీ సమాధానమిస్తూ బైపాస్ నిర్మాణం పనులలో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం 32 శాతం బైపాస్ పనులు జరిగాయని, గడువులోగా నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.