శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ త్యాగం మరువలేనిది

ABN , First Publish Date - 2021-06-24T04:56:44+05:30 IST

దేశం కోసం శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ త్యాగం మరువలేనిది
మెదక్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బీజేపీ జిల్లా బృందం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌

పలు మండలాల్లో ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి

మెదక్‌ అర్బన్‌/చేగుంట/తూప్రాన్‌ రూరల్‌/హవేళీఘణపూర్‌/నర్సాపూర్‌/చిల్‌పచెడ్‌/ జూన్‌ 23 : దేశం కోసం శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘ఒకే ప్రధాని..ఒకే జెండా ఒకే చట్టం’ అనే నినాదంతో జన సంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌, రాష్ట్ర నాయకుడు రామ్మోహన్‌గౌడ్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణ, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌ పాల్గొన్నారు. చేగుంట మండలంలోని గాంధీ చౌరస్తాలో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తూప్రాన్‌ మండలంలోని ఘనపూర్‌ గ్రామంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులయాదవ్‌ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు యాదగిరి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్‌, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ పాల్గొన్నారు. హవేళీఘణపూర్‌ మండలంలోని కూచన్‌పల్లి, హవేళీఘణపూర్‌ గ్రామాల్లో ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. నర్సాపూర్‌ పట్టణంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతిని నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ గోడ రాజేందర్‌ పాల్గొన్నారు. చిల్‌పచెడ్‌ మండలంలో బీజేపీ అధ్యక్షుడు దశరథ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

సంగారెడ్డి జిల్లాలో 

సంగారెడ్డి అర్బన్‌/జహీరాబాద్‌, జూన్‌ 23 : శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలు పాటిద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి సూచించారు. సంగారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ముఖర్జీ వర్థంతి (బలిదాన్‌దివ్‌స) సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. పట్టణ అధ్యక్షుడు వినోద్‌, రాష్ట్ర నాయకులు సంగమేశ్‌, చంద్రశేఖర్‌, దేశ్‌పాండే, సురేందర్‌, మురళీధర్‌రెడ్డి, రవిశంకర్‌ పాల్గొన్నారు. జహీరాబాద్‌ పట్టణంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బీజేపీ, బీజేవైఎం, కిసాన్‌మోర్చా, ఓబీసీ మోర్చీ నాయకులు శ్రీనివా్‌సగౌడ్‌, నౌబాద్‌జగన్‌, సుధీర్‌బండారి, శ్రీనివా్‌సగుప్తా, నరేష్‌పాటిల్‌, రాఘవేందర్‌నాయక్‌, ఆశోక్‌, అల్లాడి బక్కయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:56:44+05:30 IST