దేశానికి పాలకులు చేసిందేమీ లేదు
ABN , First Publish Date - 2022-08-12T05:08:07+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్రెడ్డి, సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెకట్రరి కొండ ప్రశాంత్రెడ్డి అన్నారు.
- ఆజాదీకా గౌరవ్ యాత్రలో కాంగ్రెస్ నాయకులు
దేవరకద్ర, ఆగస్టు 11 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్రెడ్డి, సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెకట్రరి కొండ ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు గురువారం ఆ పార్టీ నాయకులు ఆజాదీ గౌరవ్ పాదయాత్రలో భాగంగా మండ లంలో యాత్ర చేపట్టారు. మండంలోని లక్ష్మీపల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి, చౌదర్పల్లి, దేవరకద్ర గ్రామాల్లో జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్, రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ టీసీ శ్రీనివాసులు, నాయకులు రాఘవేందర్ రెడ్డి, వీరారెడ్డి, రాజు, పాల్గొన్నారు.