రాత్రి 12 గంటలకు థియేటర్‌లో అక్షయ్, కత్రీనా మధ్య రొమాంటిక్ సీన్.. దాన్ని చూసిన కుర్రాడు రెచ్చిపోయి.. పక్కనే ఉన్న అమ్మాయితో..

ABN , First Publish Date - 2021-11-07T22:25:27+05:30 IST

అతడికి సుమారు 20ఏళ్ల వయసు ఉంటుంది. సరదాగా సినిమాకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ థియేటర్‌లో అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌కు సంబంధించిన సినిమా నడుస్తున్నట్టు తెలుసు

రాత్రి 12 గంటలకు థియేటర్‌లో అక్షయ్, కత్రీనా మధ్య రొమాంటిక్ సీన్.. దాన్ని చూసిన కుర్రాడు రెచ్చిపోయి.. పక్కనే ఉన్న అమ్మాయితో..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి సుమారు 20 ఏళ్ల వయసు ఉంటుంది. సరదాగా సినిమాకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. స్థానికంగా ఉన్న ఓ థియేటర్‌లో అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌కు సంబంధించిన సినిమా నడుస్తున్నట్టు తెలుసుకుని.. సెకండ్‌ షోకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత బైక్‌పై ఒక్కడే థియేటర్‌కు వెళ్లి, హాల్‌లో కూర్చున్నాడు. సినిమా మొదలైపోయింది. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటల సమయంలో అక్షయ్, కత్రీనా కైఫ్ మధ్య ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది. దీంతో పక్కనే ఉన్న యువతిని చూసి, యువకుడు రెచ్చిపోయాడు. విషయం తెలిసి సినిమా హాల్లో ఉన్న మిగతా ప్రేక్షకులు షాకయ్యారు. ఇంతకూ అక్కడ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్ నటించిన సూర్యవన్షి (Sooryavanshi) సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భోపాల్‌కు చెందిన ఓ యువకుడు సరదాగా ఆ సినిమాకు వెళ్లేందుకు రెడీ అయ్యాడు. స్థానికంగా ఉన్న సంగం థియేటర్‌లో మూవీ చూసేందుకు సెకండ్ షోకు టికెట్ బుక్ చేసుకున్నాడు. సినిమా స్టార్ట్ అయ్యే సమయానికే  అక్కడకు చేరుకున్నాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అందులోని డైలాగ్‌లు, పాటలను ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలోనే రాత్రి 12 గంటల సమయంలో అక్షయ్ కుమార్, కత్రీనా కైఫ్‌ల మధ్య ఓ రొమాంటిక్ సన్నివేశం వచ్చింది. ఆ సీన్‌ను చూసి, యువకుడు రెచ్చిపోయాడు. 


పక్కనే ఉన్న యువతిని చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతిలో కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే యువడిపై చెప్పుతో దాడి చేసింది. హాల్లో ఉన్న ఇతర ప్రేక్షకులకు కూడా విషయం తెలియడంతో.. అందరూ కలిసి ఆ యువకుడిని చితక్కొట్టారు. ఈ నేపథ్యంలోనే కొందరు వీడియో తీసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవికాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2021-11-07T22:25:27+05:30 IST