సమాజాన్ని చైతన్యంలో కవుల, కళాకారుల పాత్ర గొప్పది
ABN , First Publish Date - 2022-01-27T04:57:12+05:30 IST
సమాజాన్ని చైతన్యంలో కవుల, కళాకారుల పాత్ర గొప్పది
ఆమనగల్లు, జనవరి 26: సమాజాన్ని చైతన్యపర్చడంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యం అని సీఐ జె.ఉపేంరద్ అన్నారు. ప్రజల జీవన స్థితిగతులను సాహిత్యం, కళారూపాల ద్వారా తెలియపరుస్తున్న ఘనత వారికే దక్కిందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి పురష్కారానికి ఎంపికైన కవి తగుళ్ల గోపాల్కు ఆమనగల్లు పోలీ్సస్టేషన్ ఆవరణలో సీఐ ఆధ్వర్యంలో బుధవారం సత్కరించారు. ఎంపీపీ అనితవిజయ్, జడ్పీటీసీ అనురాధ, ఏఎంసీ చైర్మ న్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్చైర్మన్ గిరియాదవ్, మున్సిపల్ చైర్మన్ రాం పాల్, ఎస్ఐ ధర్మేశ్ తదితరులు గోపాల్కు శాలువాలతో సత్కరించారు. దండకడియం కవితా సంపుటితో సాహిత్య అకాడమి పురస్కారం రావడం గొప్ప విషయం అన్నారు. ఏఎ్సఐలు బాల్రెడ్డి, నిరంజన్, పీఎ్సఐ ప్రదీప్, వైస్ఎంపీపీ అనంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, రైతు సమితి నారాయణ, నాయకులు పత్యనాయక్, చెక్కాల లక్ష్మణ్, మండ్లీ రాములు, మానయ్య, హరిప్రసాద్, రాము, శ్రీను, కృష్ణనాయక్, ప్రసాద్, రజాక్, ఖలీల్, రమేశ్, సరిత పాల్గొన్నారు.