అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
ABN , First Publish Date - 2022-05-18T05:40:41+05:30 IST
అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
చేవెళ్ల, మే 17: గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని చేవెళ్ల జడ్పీటీసీ ఎం.మాలతిరెడ్డి అన్నారు. మండలంలోని దామరిగిద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన హరికృష్ణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సందర్భంగా మంగళవారం దామరిగిద్ద గ్రామంలో గ్రామకార్యదర్శి హరికృష్ణకు సర్పంచ్ ఎం.వెంకటేశంగుప్తా, వార్డుసభ్యులతో కలిసి సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీడీవో రాజ్కుమార్తో పాటు చేవెళ్ల జడ్పీటీసీ మాలతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై హరికృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉన్నారు.