ఆర్జేసీ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-07-25T06:00:10+05:30 IST
జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.
- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి కల్చరల్, జూలై 24: జూనియర్, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. మహత్మ జ్యోతిబాఫూలే, బీసీ రెసిడెన్షియల్ సొసైటీ వారు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రెసిడెన్షియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశపరీక్ష కోసం జిల్లా వ్యాప్తంగా 7 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ను నియమించామని తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద మొబైల్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ జగన్మోహన్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.