పంటను మింగిన కడెం వాగు!

ABN , First Publish Date - 2022-08-10T10:16:08+05:30 IST

అప్పులు చేసి నాలుగు ఎకరాల కౌలు భూమిని సాగు చేయగా, కడెం వాగు ఉధృతికి పంట కొట్టుకుపోయింది.

పంటను మింగిన కడెం వాగు!

అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య 

పెంబి, ఆగస్టు 9: అప్పులు చేసి నాలుగు ఎకరాల కౌలు భూమిని సాగు చేయగా, కడెం వాగు ఉధృతికి పంట కొట్టుకుపోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా పెంబి మండలం శెట్‌పల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు గంగరాజు (47) తనకున్న ఎకరం భూమితో పాటు మరో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. అయితే కడెం వాగు ఉధృతికి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పంట పెట్టుబడికి తెచ్చిన రూ. 2లక్షల అప్పును ఎలా తీర్చాలన్న మనస్థాపంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2022-08-10T10:16:08+05:30 IST