పంటను మింగిన కడెం వాగు!
ABN , First Publish Date - 2022-08-10T10:16:08+05:30 IST
అప్పులు చేసి నాలుగు ఎకరాల కౌలు భూమిని సాగు చేయగా, కడెం వాగు ఉధృతికి పంట కొట్టుకుపోయింది.
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
పెంబి, ఆగస్టు 9: అప్పులు చేసి నాలుగు ఎకరాల కౌలు భూమిని సాగు చేయగా, కడెం వాగు ఉధృతికి పంట కొట్టుకుపోయింది. దీంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం శెట్పల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు గంగరాజు (47) తనకున్న ఎకరం భూమితో పాటు మరో 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. అయితే కడెం వాగు ఉధృతికి పంట పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పంట పెట్టుబడికి తెచ్చిన రూ. 2లక్షల అప్పును ఎలా తీర్చాలన్న మనస్థాపంతో మంగళవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.